మహిళా శక్తిని బలపరిచే సినిమాలకు సపోర్ట్‌ చేసేందుకు ఇక్కడకు వచ్చా: సమంత

హాలీవుడ్‌ సూపర్‌ హీరోస్‌ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్‌ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. మళ్లీ చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రం ‘ది మార్వెల్స్‌’ పేక్షకుల ముందుకు రానుంది. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా 2019లో వచ్చిన కెప్టెన్‌ మార్వెల్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. 2020లో నియా డకోస్టా దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు అన్ని హంగులు పూర్తి చేసుకుని దీపావళి కానుకగా నవంబర్‌ 10న విడుదలకు సిద్ధమైంది. కెప్టెన్‌ మార్వెల్‌గా బ్రీ లార్సన్‌, మిస్‌ మార్వెల్‌గా ఇమాన్‌ వెల్లనీ, మొనికాగా తెయోనా పారిస్‌ నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలవగా అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. 2019లో వచ్చిన కెప్టెన్‌ మార్వల్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించి నిర్మాతలకు ఊహించని లాభాలను తెచ్చి పెట్టింది. దీంతో ఇప్పుడు రాబోతున్న సినిమాపై అంతటా వీపరీతమైన క్రేజ్‌ ఏర్పడిరది. ఈ క్రమంలో అప్పట్లో భారతదేశంలో స్టార్‌ హీరోయిన్స్‌ సమంత , తమన్నా, రకుల్‌, కాజల్‌తో ప్రచారం చేయించినట్టుగానే ఇప్పుడు విడుదల అవుతున్న ‘ది మార్వెల్స్‌’కు కూడా మరోసారి ప్రమోషన్స్‌ చేయించాలని అనుకున్నట్లు ఆ చిత్ర యూనిట్‌ మూడు నెలల క్రితం తెలిపింది. అయితే ప్రస్తుతం సమంత మాత్రమే ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రమోషన్‌ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేసింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ మార్వెల్స్‌, ఎవెంజర్స్‌ సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళా శక్తిని బలపరిచే సినిమాలకు సపోర్ట్‌ చేసేందుకు ఇక్కడకు వచ్చానని నేను మార్వెల్‌ చిత్రాలకు పెద్ద మానిని తెలిపింది. నేను ఓ ఎవెంజర్‌ అయి నాకో టీమ్‌ ఉంటే అందులో నా ఫ్యాన్స్‌ ఉండాలని కోరుకుంటానని, అదే హీరోలు టీమ్‌గా ఉండాలనుకుంటే అల్లు అర్జున్‌, విజయ్‌, అలియా, ప్రియాంకా చోప్రా వంటి వారు ఉండాలని కోరుకుంటానంది. కాగా ఈ సినిమాలో కెప్టెన్‌ మార్వెల్‌తో పాటు మిస్‌ మార్వెల్‌, కెప్టెన్‌ మొనికలు కూడా ఉంటారని ఆ ముగ్గురు కలిససి చేసే పోరాట దృశ్యాలు సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటాయని తెలిపారు.