సమంతతో ఇకపై కష్టమే.!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ సమంత. బాలీవుడ్‌లోనూ ‘ఫ్యామిలీ మేన్ 2’ వంటి వెబ్ సిరీస్‌తో మంచి పేరు దక్కించుకుంది. త్వరలోనే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ మధ్య సమంత ఆరోగ్యం ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసిన సంగతి తెలిసిందే.

మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా సమంత చాలా సిక్ అయ్యింది. కొన్ని నెలల పాటు సినిమా షూటింగులకు దూరమైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి వచ్చి ఎలాగోలా ‘సిటాడెల్’ సిరీస్, ‘ఖుషీ’ సినిమా పూర్తి చేసింది.

కానీ, సమంత ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. దాంతో, పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్న నెపంతో సినిమాలకు తాత్కాలిక బ్రేకిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత ‘ఖుషి’ ప్రమోషన్ల కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంటోంది. ‘ఖుషి’ ప్రమోషన్లలో భాగంగా లేటెస్టుగా నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్‌లో సమంత కనిపించింది.

ఈ కార్యక్రమంలో సింగర్ చిన్మయి, హీరో విజయ్ దేవరకొండ.. సమంత ఆరోగ్యం గురించి ప్రస్థావించారు. చెప్పకూడదనుకున్నాను కానీ.. అంటూనే విజయ్ దేవరకొండ సమంత ఆరోగ్యం గురించి కొన్ని నిజాలు బయట పెట్టేశాడు.

సమంత ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. కానీ, మీ అందరి అభిమానం గురించే ఈ స్టేజ్ పైకి వచ్చింది. లైటింగ్‌లో ఎక్కువ సేపు సమంత వుండలేదు.. కళ్లు ఎర్రగా మారి మంట పుడతాయ్. తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది.. అని చెప్పాడు.

బహుశా సినిమాపై సింపథీ క్రియేట్ చేయాలనుకున్నాడు కాబోలు విజయ్ దేవరకొండ. కానీ, అది సమంత అరోగ్యంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. మేకర్లు ఇకపై సమంతతో సినిమాల్ని మర్చిపోవాల్సిందేనేమో అనే అభిప్రాయానికొచ్చేస్తున్నారు.