భారీగా విరాళాలు ఇస్తున్న సమంత… అదే కారణమా?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో వరుస అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ జంట కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకుని ఒకరికొకరు దూరమయ్యారు. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

ఆ బాధ నుండి బయటపడటానికి ఎన్నో దేవాలయాలను దర్శించింది. ఈ క్రమంలో మానసికంగా దృఢంగా ఉండటం కోసం ఎన్నో పూజలు కూడా నిర్వహించింది. ఇక నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇక్కడ కనిపించడం లేదు. దీంతో ఆమె అనారోగ్యంతో బాధపడుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సమంత గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల సమంత సికింద్రాబాద్లోని ఒక వేద పాఠశాలలో పండితుల మధ్య పూజలు నిర్వహించిందని వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అంతేకాకుండా ఆ గురుకులానికి సమంత భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ “ప్రత్యూష ఫౌండేషన్” అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎంతోమంది అనాధలకి అణగారిన మహిళలకు అండగా నిలుస్తోంది. ఇక ఇప్పుడు సమంత నిరుపేదలను ఆదుకోవడం కోసం భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా సమంత గురుకుల పాఠశాలలకు, పేదలకు విరాళాలు ఇవ్వటానికి కూడా కారణం ఉంది. విడాకుల తర్వాత మానసికంగా సమంత చాలా కృంగిపోయింది. ఇప్పటికి కూడా సమంత ఆ బాధ నుండి బయటపడటం లేదు. ఇలా తన చుట్టూ ఉన్న ప్రతికూలతలను ఎదుర్కొనేందుకే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటమే కాకుండా ఇలా పండితులకు పేదలకు దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుందని భావించి భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.