వదిన పోస్ట్ సమంతకిచ్చారేంటీ.!

రౌడీ ఫ్యాన్స్ రష్మిక మండన్నాని ‘వదినా..’ అని పిలుచుకునేవారు. అంటే, విజయ్ దేవరకొండతో రష్మిక స్నేహం, కాదు కాదు అంతకు మించి ఇంకేదో.. వుందన్న ఆలోచనతోనే, ఆ ఆలోచనను స్వాగతిస్తూ రష్మికకు వదిన పోస్ట్ ఇచ్చేశారు రౌడీస్. ఆ పోస్ట్‌ని రష్మిక కూడా బాగా ఎంజాయ్ చేసేది. అయితే, ఇప్పుడా పోస్ట్‌కి సమంత రూపంలో ఎసరు పడేలా కనిపిస్తోంది. ఇప్పుడు సమంతను వదినా అని పిలుస్తున్నారు సోషల్ మీడియాలో.

అందుకు కారణం ‘ఖుషి’ సినిమా ప్రమోషన్లు. సినిమాలో విజయ్ దేవరకొండకీ, సమంతకీ మధ్య ఆన్ స్ర్కీన్ కెమిస్ర్టీ ఓ రేంజ్‌లో
వుందని ప్రమోషన్ల ద్వారా తెలుస్తోంది. ఇక, ఆఫ్ స్ర్కీన్ కూడా వీరిద్దరి మధ్యా ఏదో వుందంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయ్. ‘ఖుషి’ ఈవెంట్‌లో సమంతను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు విజయ్ దేవరకొండ.

కనీసం పువ్వులు కూడా ఆమెపై పడకూడదన్నంత కేర్ తీసుకున్నాడు. ఆమె ముఖంలో నవ్వు చూడాలన్నదే తన లక్ష్యమని స్టేట్‌మెంట్ కూడా పాస్ చేసేశాడు రౌడీ. చేయీ చేయీ పట్టుకుని వీరిద్దరూ చేసిన ఓవరాక్షన్ అబ్బో.! అంతా ఇంతా కాదు. ఇదంతా చూసి, సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది.

నాగ చైతన్య ఫ్యాన్స్ అయితే ర్యాగింగ్ చేస్తున్నారు సమంతని. ‘మావోడు వదిలించుకున్నాడు. మీ వోడు తగులుకున్నాడు..’ అంటూ రౌడీ ఫ్యాన్స్‌ని సైతం ఘోరంగా టార్గెట్ చేస్తున్నారు.

అయితే, సమంత అనారోగ్యం పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేసి, క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడంతే రౌడీ. అంతకు మించి ఇంకేం లేదు.. అని ఈ ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నారు ఇంకొంత మంది. మొత్తానికి రౌడీ వ్యూహం ఏంటో కానీ, సినిమా రిజల్ట్ వచ్చాకా సర్వం తెలిసిపోతుంది.!