తప్పు తెలుసుకున్న సమంత.!

అత్యంత ప్రమాదకరమైన వ్యాధే అయినప్పటికీ సమంత మనో ధైర్యంతో గుండె నిబ్బరంతో ఆ వ్యాధిని ఎదుర్కొంది. ఈ మధ్యనే తన రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లోకి వచ్చేసింది.

షూటింగుల్లోనూ పాల్గొంటోంది. ‘సిటాడెల్’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా పూర్తి చేసేసింది. అంతా బాగానే వుంది. కానీ, సమంత నుంచి వచ్చిన రీసెంట్ మూవీ ‘శాకుంతలం’ ప్రమోషన్లలో సమంత హెల్త్ ఇష్యూ బాగా హైలైట్ అయ్యింది.

తన హెల్త్ ఇష్యూను అడ్డం పెట్టుకుని సింపథీ గెయిన్ చేస్తోందంటూ ప్రచారం జరిగింది. మీడియానే సమంతను ఆమె ఆరోగ్యం గురించి ప్రశ్నలు వేసింది. ఆయా ప్రశ్నలకు మాత్రమే సమంత సమాధానమిచ్చింది.

కానీ, బయటికి అది మరోలా ప్రమోట్ అయ్యింది. చేసిందంతా చేసి, మీడియా తప్పంతా సమంతపై నెట్టేసింది. అందుకే ఈ సారి తన హెల్త్ ఇష్యూ గురించి ప్రస్థావన వస్తే సున్నితంగా ఇగ్నోర్ చేయాలని నిర్ణయించుకుందట సమంత.

తన ప్రమేయం లేకుండానే తాను మాట్లాడింది ఒకటయితే, బయటికి ప్రమోట్ అయ్యేది మరొకటి అన్నట్లుగా నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలోనే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుందట.

మరోవైపు సమంత హెల్త్ ఇష్యూ దృష్ట్యా ఆమెతో సినిమాలు ఎంతవరకూ సేఫ్ అనే అనుమానాలు దర్శక నిర్మాతల్లో వస్తున్నాయ్ అనే టాక్ వినిపిస్తోంది.