చైతూ పోస్ట్ పై రియాక్ట్ అయిన సమంత

నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ మే 12న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతతో విడాకులు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సమంతతో విడిపోయి రెండేళ్ళు అవుతుందని, చట్టపరంగా విడాకులు మంజూరై ఏడాదికి పైగా అయ్యిందని చెప్పుకొచ్చారు. ఆమెని ఎప్పటికి గౌరవిస్తూనే ఉంటానని, సమంత మంచి మనసున్న వ్యక్తి అని చైతూ చెప్పుకొచ్చారు. ఏవో కొన్ని కారణాల వలన తమ మధ్య దూరం పెరిగిందని చెప్పుకొచ్చారు. అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన ప్రచారాలు తమ మధ్య దూరం పెరిగినట్లు చూపిస్తున్నాయని అన్నారు.

తాము విడిపోయిన కూడా సమంత నిర్ణయాలకి తాను రెస్పెక్ట్ ఇస్తానని చైతన్య క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా సమంత చైతన్య కామెంట్స్ పై రియాక్ట్ అయినట్లు ఆమె పెట్టిన పోస్ట్ బట్టి అర్ధమవుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక కొటేషన్ ని సమంత షేర్ చేసింది. అందులో మనమంతా ఒక్కటే.. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి అని ఉంది.

ఓ విధంగా చైతన్య కామెంట్స్ కి రియాక్షన్ గానే ఈ కొటేషన్ ఉండటం విశేషం. గతంలో సమంత చైతూ గురించి కాస్తా నెగిటివ్ యాంగిల్ లోనే రియాక్ట్ అయ్యారు. అయితే చైతూ ఆమె గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో ఇప్పుడు ఈ కొటేషన్ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మూడో వ్యక్తి ప్రమేయం కారణంగా సమంత, నాగ చైతన్య బంధం వీగిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరి రూట్ లో వారు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే అందరూ అనుకునే విధంగా వారి మధ్య ద్వేషించుకునేంత శత్రుత్వం అయితే లేదని తాజాగా చైతూ కామెంట్స్, సమంత పోస్ట్ తో కన్ఫర్మ్ అయ్యింది.