వైరల్ : ఫ్యాన్స్ కి సమంత సందేశం.!

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్స్ లో సమంత రూత్ ప్రభు కూడా ఒకామె కాగా ఆమ్ తన పర్సనల్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకున్నాక అయితే ఇక కెరీర్ పరంగా ఎక్కడా ఆమె స్లో డౌన్ అవ్వలేదు. అయితే సమంత ఇదే సమయంలో మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడం మాత్రం షాకింగ్ మారింది.

అయితే ఓ పక్క దీనితో పోరాడుతూనే సినిమాలు చేస్తూ డబ్బింగ్ చెప్తూ అలాగే సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా చాలా హుషారుగా పాల్గొంటుంది. దీనితో సమంతపై చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నప్పటికీ ఆమె తన పని అయితే చేసుకుంటూ వెళ్తుంది.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఆమె నటించిన చిత్రం “ఖుషి” సంగీత కచేరీలో అయితే ఆమె తన ఫ్యాన్స్ కి ఇచ్చిన సందేశం వైరల్ గా మారింది. తాను ఇప్పుడు మాయోసైటిస్ తో పోరాడుతున్నాను అని దీని నుంచి కోలుకున్నాక బ్రేక్ మరింత బలంగా డెఫినెట్ గా మళ్ళీ మీ అందరి కోసం మీ అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు వస్తాను అని మాటిస్తున్నా అంటూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

దీనితో సామ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ హీరోగా నటించగా సమంతకి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.