హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తోన్న సమంత!

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత ప్రస్తుతం ఫారెన్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవలే ’ఇండియా డే పరేడ్‌’ కోసం న్యూయార్క్‌ వెళ్లిన సామ్‌.. ప్రస్తుతం అక్కడే ఉంటోంది. ఈ సందర్భంగా ఖుషి చిత్రాన్ని ప్రొమోట్‌ చేస్తోంది. తాజాగా సామ్‌ కాలిఫోర్నియా లో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. తన విలువైన సమయాన్ని ప్రకృతితో గడుపుతోంది. ఈ మేరకు ఫొటోలను పంచుకుంది. ఫొటోల్లో సామ్‌.. స్విమ్మింగ్‌ పూల్‌లో రిలాక్స్‌ అవుతూ కనిపించింది.

ప్రస్తుతం ఈ పిక్స్‌ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి సమంత నటించిన ’ఖుషి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరెక్కిన ఈ చిత్రానికి నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.

ఈ చిత్రంలో సచిన్‌ ఖడేకర్‌, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జయరాం, శరణ్య ప్రదీప్‌ కీలక పాత్రలు పోషించారు. సామ్‌.. ఖుషితోపాటు బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి ’సిటాడెల్‌’ అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటించింది. ఆ సిరీస్‌ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.