ప్రెస్టీజియస్ మూవీలో సమంత.?

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న సినిమాలో సమంత.. అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే రిలీజ్‌కి సిద్ధంగా వుంది.

ఈ టైమ్‌లో సమంత పేరు ఈ సినిమా కోసం వినిపిస్తుండడం విశేషంగా వుంది. ఈ మధ్యనే సమంత సినిమాలకు తాత్కాలికంగా బ్రేకిస్తోందని ప్రకటించింది. ఇంతలోనే కోలీవుడ్‌లో ఈ ప్రచారం జోరందుకోవడమేంటీ.? అని ఒకింత ఆశ్చర్యం కలుగుతోంది.

అయితే, ‘పుష్ప’ సినిమా టైమ్‌లోనూ ఇలాగే జరిగింది. లాస్ట్ మినిట్‌లోనే సమంతతో ‘ఊ అంటారా ఊ ఊ అంటారా..’ సాంగ్ తెరకెక్కించారు. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే కాదు, సమంతకీ పిచ్చ పిచ్చగా పాపులారిటీ తెచ్చిపెట్టింది.

ఈ తరహాలోనే ‘లియో’ కోసం కూడా ఓ ఇంట్రెస్టింగ్ సాంగ్ అది స్పెషల్ సాంగ్ కావచ్చు.. లేదంటే ప్రమోషనల్ సాంగ్ కావచ్చు.. అలాంటిదేమైనా డిజైన్ చేస్తున్నారా.? అనే అనుమానాలు కలుగుతున్నాయ్. వివరాలు తెలియాల్సి వుంది. ప్రస్తుతం తెలుగులో సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.