సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లిన స్టార్ హీరోయిన్స్ లో సమంత కి మాత్రం స్పెషల్ ప్లేస్ ఉంటుంది అని చెప్పాలి. హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇక నెక్స్ట్ పుష్ప లో మాస్ ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా లెవెల్లో ఒక్కసారిగా సమంత మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీనితో అక్కడ నుంచి సమంత మరిన్ని పాన్ ఇండియా ఆఫర్స్ దక్కించుకుంది.
అయితే మెయిన్ గా మెయిన్ లీడ్ గా తాను ఉండే సినిమాలే చేస్తుండగా హీరోయిన్ గా అయితే విజయ్ దేవరకొండ తో దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో మళ్ళీ “మజిలీ” తర్వాత వర్క్ చేస్తుంది. అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే సమంత కి ఆరోగ్యం పరంగా పలు ఇబ్బందులు ఎదురైన సంగతో తెలిసిందే.
కాగా మొత్తానికి సమంత మళ్ళీ ఈ సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టినట్టుగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. నిన్న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే “ఖుషి” సెట్స్ లో అడుగు పెట్టినట్టుగా చిత్ర నిర్మాతలు తెలిపారు. దీనితో మా స్ట్రాంగ్ లేడీ కి గ్రాండ్ వెల్కమ్ అందిస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ తెలియజేయగా ఆమె తో కేక్ కట్ చేయించి ఆహ్వానం పలికారు.
దీనితో ఈ ఫోటోలు ఇప్పుడు విశేషంగా మారాయి. కాగా ఈ కొత్త షెడ్యూల్ అయితే ఈ నెలంతా జరగనుండగా సినిమా షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేయనున్నారు. అలాగే మంచి సమయం చూసి సినిమాని థియేట్రికల్ గా రిలీజ్ చేయనున్నారు.
Team #Kushi wishes our beautiful and strong lady @Samanthaprabhu2 and all the wonderful women out there a very Happy Women's Day ❤️
Welcome back to the sets❤️@TheDeverakonda @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/rK98pfybtT
— Mythri Movie Makers (@MythriOfficial) March 8, 2023