Samantha : శాకుంతలం సినిమాపై సతమతమవుతున్న సమంత అభిమానులు…!

Samantha : ప్రస్తుతం సమంత టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అన్న భేదం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉంది. పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సంపాదించుకుంది సమంత. తాజాగా సమంతా, నయనతార, విజయ్ సేతుపతి నటించిన కె ఆర్ కె సినిమా 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలే కాకుండా సమంత వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అయితే సమంత అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం. ఈ మధ్యనే సమంత ఈ సినిమాకు తన డబ్బింగ్ పూర్తి చేశానని అధికారికంగా తెలిపింది.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యి చాలాకాలమే అవుతోంది. అయినా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తారీఖును ఇప్పటివరకు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించడం లేదు. దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ స్వయంగా భారీ అంచనాలతో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నే ఇప్పటికి బిజీగా ఉన్నారు. గుణశేఖర్ తీసిన ఆఖరి చిత్రం ఎనిమిది ఏళ్ళ క్రితం వచ్చిన రుద్రమదేవి. అయితే రుద్రమదేవి సినిమా లోని గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు చేసిన గుణశేఖర్ సమయం కూడా అలాగే తీసుకున్నారు కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

ప్రస్తుతం శాకుంతలం సినిమా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది రుద్రమదేవి సినిమా తరహాలోనే శాకుంతలం సినిమాకు కూడా గ్రాఫిక్స్ పరంగా భారీగా ఖర్చు పెడుతూ, అధిక సమయం కేటాయిస్తున్నారు. అందుకే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ శాకుంతలం సినిమా కూడా రుద్రమదేవి సినిమా లాగానే మంచి అవుట్ పుట్ ఇవ్వకపోవచ్చు ఏమో అని అభిప్రాయపడుతున్నారు.ఈ ఏడాదిలోనైనా సినిమాను విడుదల చేస్తారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.