Samantha : మరో వ్యాపారం లోకి అడుగు పెట్టిన సామ్!!

Samantha : సమంత అనగానే అందరి హీరోలతో హిట్ సినిమాలు తీసిన లక్కీగర్ల్ గా అనిపిస్తుంది. తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ మంచి ప్రాజెక్టలను ఎంచుకుంటున్న సమంత చాలా ఇంటర్వ్యూల్లో డబ్బు విలువ గురించి చెప్తూ ఉంటుంది. తాను సేవ కార్యక్రమాల్లో కూడా ఎపుడు ముందుంటుంది.అయితే తన వ్యక్తిగత జీవితం లో నాగ చైతన్యతో వివాహం తర్వాత మళ్ళీ విడాకులు తీసుకోవడంతో సామ్ డిప్రెషన్ లోకి వెళ్లిందని అందరు అనుకున్నారు.

కానీ సామ్ మాత్రం అందుకు భిన్నంగా ఛార్‌ధామ్ అంటూ తీర్థయాత్రను చేసింది. ఆ తరువాత దుబాయ్ వెకేషన్‌కు వెళ్లింది. అటుపై స్విట్జర్లాండ్‌లో అడ్వెంచర్లు చేసేసింది.మొత్తానికి సమంత మాత్రం క్షణం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకంతో బిజీగా మారుతోంది. ఇక తన ఏకం లెర్నింగ్ స్కూల్, సాకీ బట్టల వ్యాపారం, ఇతర ప్రకటనలతో సమంత బాగానే బిజీగా మారింది. ఆల్రెడీ యశోద సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే సమంత మరో కొత్త అడుగు వేసింది.

తన ఫ్రెండ్ శిల్పా రెడ్డి ప్రారంభించిన సస్టైన్ కార్ట్ సంస్థలో సమంత ఇన్వెస్ట్ చేసింది. సస్టైన్ కార్ట్‌లో అన్ని రకాల ఉత్పత్తులను సహజమైన పద్దతిలోనే తయారు చేస్తారు. వాటిని ఇండియా వ్యాప్తంగా డెలివరీ చేస్తుంటారు. అలాంటి ఈ సంస్థలో సమంత ఇన్వెస్ట్ చేసింది. ఈ మేరకు సమంత ఓ పోస్ట్ వేసింది. ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం అందరూ కూడా ప్రకృతికి హాని కలగని, సహజ సిద్దమైన ఉత్పత్తులనే కోరుకుంటున్నారు. శిల్పా రెడ్డి ఐడియాతో కలవడం ఆనందంగా ఉందంటూ సమంత చెప్పుకొచ్చింది.

ఇలా సమంత తన సినిమా కెరీర్ లో దూసుకుపోతూనే వ్యాపారంలోను అడుగుపెడుతూ తన సత్తా చూపిస్తోంది.. అలా తన మార్కు ను ఇటు సినీరంగం పైన అటు వ్యాపార రంగం పైన వేస్తోంది.