లేటెస్ట్ : మరో పాన్ ఇండియా సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసిన సమంత.!

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో పాన్ ఇండియా హీరోయిన్ సమంత కూడా ఒకరు. అయితే సమంత ఇపుడు పలు భారీ ఆఫర్స్ తో బిజీగా ఉండగా ఆల్ మోస్ట్ ఇప్పుడు ఆమె అన్నీ పాన్ ఇండియా సబ్జెక్టులే చేస్తుంది.

కాగా ఇదిలా ఉండగా రీసెంట్ గానే మొన్ననే తన భారీ సిరీస్ “సిటాడెల్” ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన సమంత ఇక దీని తర్వాత దీంతోనే చేస్తున్న మరో పాన్ ఇండియా సబ్జెక్టు అయినటువంటి చిత్రం “ఖుషి” కూడా ఇప్పుడు కంప్లీట్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

కాగా గత కొన్నాళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అయితే ఎప్పుడు కంప్లీట్ చేస్తుందా అని చాలా మంది అనుకోగా ఫైనల్ గా అయితే ఈ చిత్రం ఈరోజు కంప్లీట్ అయ్యిపోయినట్టుగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ అంత కంప్లీట్ చేయడంతో మేకర్స్ సినిమా యూనిట్ తో కలిసి కేక్ ని కట్ చేసి సెలబ్రేట్ చేసి తెలిపారు.

మొత్తానికి అయితే ఇప్పుడు సమంత కంప్లీట్ గా ఖాళీ అయ్యిపోయింది అని చెప్పాలి. ఈ తర్వాత అయితే మరో ఏడాది బ్రేక్ ఇచ్చి ఈ గ్యాప్ లో ఆమె తన ట్రీట్మెంట్ ని తీసుకోనుంది. ఇక ఈ ఖుషి చిత్రంలో సెన్సేషల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించగా శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.