స‌మంత బిగ్ బాస్‌తో బిజీ.. నాగ చైత‌న్య థ్యాంక్యూతో బిజీ బిజీ!

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ‌చైత‌న్య,సమంత జంట చాలా చూడ‌ముచ్చ‌టగా ఉంటుంది. వీరిద్ద‌రిని చూసిన ఎవ‌రికైన అసూయ‌పుట్ట‌డం ఖాయం. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని స‌రదాగా గడుపుతున్న ఈ జంట ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని కూడా అంతే స‌క్సెస్‌ఫుల్‌గా సాగిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌తో అల‌రించిన స‌మంత తొలిసారి ఓ పాపుల‌ర్ షోకి హోస్ట్‌గా వ‌చ్చి అంద‌రిని అల‌రించింది. ఈ రోజు ద‌స‌రా స్పెష‌ల్ ఎపిసోడ్‌లో స‌మంత ఇంటి స‌భ్యుల‌తో పాటు త‌న మ‌రిది అఖిల్‌, హైప‌ర్ ఆది, పాయ‌ల్‌, కార్తికేయ‌తో క‌లిసి చేసిన సంద‌డి అంతా ఇంతాకాదు.

21 రోజులు హిమాల‌యాల్లో వ‌రుస‌గా షూటింగ్ జ‌రుపుంకుంటున్న కార‌ణంగా నాగార్జున ఈ రోజు బిగ్ బాస్ షోని హోస్ట్ చేయ‌లేక‌పోయారు. దీంతో ఆ బాధ్య‌త‌ని స‌మంత‌కు అప్ప‌జెప్పారు. ఆమె చ‌క్క‌గా తెలుగు మాట్లాడుతూ కంటెస్టెంట్‌ల‌కు త‌న‌దైన పంచ్‌లు విసురుతూ వావ్ అనిపించింది. మొత్తానికి ఈ రోజు బిగ్ బాస్ షో స‌మంత మానియాతోనే స‌ర‌దాగా న‌డిచింది. ఇక మ‌రోవైపు నాగ‌చైత‌న్య త‌ను న‌టిస్తున్న మ‌రో చిత్రం థ్యాంక్యూ మూవీని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు.

నా జీవితంలో ఒక ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులకు నేను థ్యాంక్‌ చెప్పాలి. ఒకరు నా మొదటి సినిమా నిర్మించిన దిల్‌ రాజుగారు. మరొకరు ‘మనం’ వంటి చిత్రాన్నిచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌. వీరిద్దరితో మరోసారి కలిసి పనిచేయబోతున్నందుకు, లెజండ్రీ కెమెరామెన్‌ పీసీ శ్రీరామ్‌ సార్‌తో పనిచేయబోతున్నందుకు చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉంది అన్నారు యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య. చైతూ 20వ సినిమాగా రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా షూట్ కు అవసరమైన సెట్స్ ను కూడా మేకర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి చైతుకి విక్రమ్ ఈ సారి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.