బీదర్‌లో సైంధవ్‌ పోరాట సన్నివేశాలు

వెంకటేష్‌ నటిస్తున్న ’సైంధవ్‌’ సినిమా పూర్తి కావొస్తోంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధికితో పాటు, శ్రద్ధ శ్రీనాథ్‌, రుహాణి శర్మ, ఆండ్రియా జెర్మియా సారా, జయప్రకాశ్‌ ఇలా చాలామంది వున్నారు. ఈ సినిమా కథ తండ్రి, కూతుర మధ్య వుండే అనుబంధం విూద ఉంటుందని తెలిసింది. ఇది ఒక యాక్షన్‌, సైన్స్‌, సెంటిమెంట్‌ అన్నీ ఇందులో వుంటాయని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఎక్కడ జరుగుతోందో తెలుసా? బీదర్‌ లో ’సైంధవ్‌’ టీము పని చేస్తోందని, అక్కడ ఒక పెద్ద పోరాట సన్నివేశం చిత్రీకరణ చేస్తున్నారని తెలిసింది.

వెంకటేష్‌, విలన్స్‌ తో పోరాటం చేసే సన్నివేశాలను దర్శకుడు శైలేష్‌ కొలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ పోరాట సన్నివేశం, సినిమాలో చాలా కీలకం అని, అందుకనే అది బీదరు వెళ్లి అక్కడ తీస్తున్నట్టుగా తెలిసింది. ఇంతవరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్‌ చూస్తే కనక ఇది ఒక యాక్షన్‌ చిత్రం అని అర్థం అవుతుంది. అలాగే ఇందులో తండ్రి, కూతురు సెంటిమెంట్‌ కూడా బాగా వర్క్‌ అవుట్‌ అవుతుందని కూడా తెలిసింది. కూతురి కోసం, వెంకటేష్‌ ఏమి చేశారు, ఎటువంటి ఇబ్బందులని ఎదుర్కొన్నారు, చివరికి ఏమి అయింది, అన్న నేపథ్యంలో ఆసక్తికరంగా వుండే సినిమా అని తెలుస్తోంది. శైలేష్‌ కొలను ఈ సినిమాలో కొంచెం సైన్స్‌ ఫిక్షన్‌ ని కూడా మిళితం చేసి తీసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని వెంకట్‌ బోయినపల్లి నిర్మిస్తున్నారు.