టాలీవుడ్ అగ్ర కథానాయకులతోనూ, ఇటు యువ హీరోలతోనూ జోడీ కడుతూ సందడి చేస్తున్నభామల్లో రష్మిక మందన్న ఒకరు. ఈ ఏడాది ఆరంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి హిట్ చిత్రాలతో అలరించిన ఈముద్దుగుమ్మ.. ప్రస్తుతం పుష్ప, ఆడాళ్ళూ మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తోంది.
తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అఖిల్ కి జోడీగా రష్మికను ఎంపికచేసిందట చిత్రబృందం. త్వరలోనే రష్మిక ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తన మూడో తెలుగు చిత్రం దేవదాస్ లో అఖిల్ తండ్రి కింగ్ నాగార్జునతో కలసి నటించారు రష్మిక. అందులో నానికి జంటగా ఆమె దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే! అయితే.. అతి తక్కువ కాలంలో క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు కొట్టేసి అందరి మనసులో చోటును సంపాదించుకున్న ఈ కన్నడ కస్తూరి కళ్ళు పొగరుతో నెత్తికెక్కాయని ఇండస్ట్రీ పెద్దలు చెప్పుకుంటున్నారు.
ఇందులో నిజమెంతుందో కానీ, ఇటీవల రష్మిక ప్రవర్తనను చూస్తున్నవారందరూ ఇదే నిజమంటున్నారు. పారితోషికం విషయంలో కూడా మెట్టు దిగడం లేదట. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో రష్మిక నిమగ్నమైనట్టు తెలుస్తోంది!?