Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ రావచ్చు… సక్సెస్ పార్టీలో సంచలన వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్!

Vijayendra Prasad: రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలకపాత్రలలో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసిన దిల్ రాజు భారీ లాభాలను తీసుకున్నారు. ఇలా ఈ సినిమాకి అధిక లాభాలు రావడంతో దిల్ రాజు సక్సెస్ పార్టీని అరేంజ్ చేసారు.

ఇక ఈ సక్సెస్ పార్టీకి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ రావచ్చు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాకి సంబంధించి కొన్ని లైన్లు రాజమౌళికి చెప్పానని, తనకి బాగా నచ్చాయని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెల్ చిత్రం రావచ్చని ఈయన ఈ సందర్భంగా వెల్లడించారు. విజయేంద్రప్రసాద్ సీక్వెల్ చిత్రం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇటు మెగా అభిమానులను అటు నందమూరి అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఇప్పటికే ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం అంటే అభిమానులలో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు.