రోజా పచ్చి అబద్దాలు..ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందేనా?

తెలుగు సినిమాకి గాను తెలుగు ఆడియెన్స్ కి గాను మెగా ఫ్యామిలీ హీరోస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మినిమమ్ సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా ముఖ్యంగా అందరి హీరోలని ఒకేలా చూసే న్యూట్రల్ ఆడియెన్స్ ని ఎవరిని అడిగినా చెప్తారు. అయితే మెగా ఫ్యామిలీ చుట్టూతా రాజకీయాలు పరంగా కూడా చాలా రచ్చ జరుగుతూ ఉంటుంది.

అలా సినిమాల్లో ఎన్ని ప్రశంసలు అందుకున్నారో రాజకీయాల్లో మెగా ఫామిలీ అంత చితికిపోయారు. మరి లేటెస్ట్ గా అయితే తమ టాలీవుడ్ సహా నటి అలాగే ప్రముఖ పార్టీ ఎమ్మెల్యే సహా మంత్రి రోజా సెల్వమణి మెగా ఫామిలీ పై మెగా హీరోలు చిరంజీవి నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ లపై చేసిన పలు కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.

అయితే లేటెస్ట్ గా మాట్లాడుతూ అసలు ముగ్గురు మెగా హీరోలు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకి చేసింది ఏది లేదని అందుకే రాజకీయాల్లో వారిని తెలుగు ప్రజలు ఓడించి ఛీ కొట్టారని వ్యాఖ్యలు చేసారు. అయితే రాజకీయాలు పక్కన పెడితే అసలు చిరు కానీ పవన్ కానీ చేసిన సాయాలు అసలు లేవంటూ రోజా మొహమాటం లేకుండా పచ్చి అబద్దాలు చెప్పడం అనేది అందరిలో షాకింగ్ గా మారింది.

ఇంత అబద్దాన్ని రోజా ఆలా చెప్పడంతో అసలు ఆమెకి ఏమీ కూడా అనిపించలేదా ఈ పర్టిక్యులర్ కామెంట్స్ విషయంలో రోజా ఆమెని ఆమే ఆత్మ విమర్శ చేసుకోవాలని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కామెంట్స్ తో కొందరు మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే మరికొందరు బాధ పడుతున్నారు.