మాల్దీవుల‌లో ఫ్యామిలీ తో చిల్ అవుతున్న ‘రాఖీభాయ్’ !

కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పొందిన రాకింగ్ స్టార్ య‌ష్ ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి మాల్దీవుల‌లో చిల్ అవుతున్నాడు. భార్య రాధికా పండిట్‌, కుమార్తె ఐరా, కొడుకు యథర్వ్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడు యష్‌. ఇటీవ‌ల త‌న తాజా చిత్రం కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి చేసిన య‌ష్ కాస్త ఉప‌శ‌మ‌నం కోసం ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లాడు. అక్క‌డ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

మాల్దీవుల‌లో చిల్ అవుతున్న య‌ష్ ఫ్యామిలీ

ఇక సినిమాల విషయానికి వస్తే యష్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’. చిత్రీకరరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. హోంబలే ఫిలింస్‌ నిర్మాణంలో ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ కాగా, ఆయ‌న జనవరి 8, 1986 న కర్ణాటకలో జన్మించారు. య‌ష్‌ని ఇప్పుడు అంద‌రు రాఖీ భాయ్ అని, రాకింగ్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. 2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన మోగ్గినా మనసు చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు. 2016 లో రాధికాతో య‌ష్‌కు వివాహం కాగా, వారు రీసెంట్‌గా ఓ యాడ్‌లో క‌లిసి న‌టించారు. కేజీయఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకు రూ .15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.