బాలీవుడ్‌లో ‘బేబీ’ సినిమా రీమేక్‌!

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ‘కలర్‌ ఫొటో’ వంటి సినిమాకి కథ అందించిన సాయి రాజేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ముక్కోణపు ప్రేమకథా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షం సైతం కురిపించింది. ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్‌ అయ్యింది.

ఇప్పుడీ సినిమా రీమేక్‌ గా హిందీలోకి వెళుతోంది. స్వయంగా సాయి రాజేష్‌ హిందీ వెర్షన్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ రీమేక్‌ ద్వారా బాబీ డియోల్‌ కుమారుడు ఆర్యమాన్‌ను ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. హీరోయిన్‌ గా కూడా కొత్త అమ్మాయినే అనుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌తో కలసి సాయి రాజేష్‌ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ రిమేక్‌ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.