షాకింగ్ : ఈ తమిళ స్టార్ హీరోస్ కి రెడ్ కార్డ్..అసలెందుకు అంటే

ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి భారీ చిత్రాలు ఒకొకటి వచ్చి సెన్సేషనల్ హిట్ లు అవుతున్నాయి. అయితే సీనియర్ హీరోస్ అంతా కూడా ఓ రేంజ్ లో హిట్స్ కొడుతుంటే అక్కడ ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే అక్కడ యంగ్ స్టార్స్ అయినటువంటి ధనుష్ విశాల్ అలాగే శింబు మరియు నటుడు అథర్వలుకి అయితే తమిళ సినిమా బోర్డు వారు రెడ్ కార్డు జారీ చేసారని తెలుస్తుంది.

అయ్యితే ఈ రెడ్ కార్డు ఎందుకంటే వారు నలుగురు కూడా ఆయా విషయాల్లో మిస్ లీడ్ చేసిన పనులకి పాల్పడ్డారు అని తెలుస్తుంది. అందుకే వారికి తమిళ సినిమా వారు రెడ్ కార్డు ఇచ్చారట. అయితే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే ధనుష్ ఓ సినిమాని కంప్లీట్ చేయకుండా మధ్యలో వదిలేసినందుకు అట అలాగే విశాల్ విషయానికి వస్తే అసోసియేషన్ డబ్బులను తప్పుడు పనులకి వాడుకున్నాడని..

అలానే శింబు మైఖేల్ రాయప్పన్ తో ఉన్న గొడవలు కారణంగా ఫైనల్ గా నటుడు అథర్వ గద్దలకొండ గణేష్ ఫేమ్ మథియా జకానా తో ఉన్న ఏదో ఇష్యూ సంబంధించి అయితే ఇరుక్కున్నారని వీటికి గాను వారు సరైన వివరణఇవ్వకపోతే ఇక తమిళ్ లో వారు సినిమాలు చేయడానికి వీలు లేదు అన్నట్టుగా రెడ్ కార్డుతో హెచ్చరించారని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ కాంట్రవర్సీ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.