మరీ లేత హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరో !

Meenakshi Chowdhary

ఓ సారి నిధీ అగర్వాల్‌.. మరో సారి అనూ ఇమ్మాన్యుయేల్.. ఇంకో సారి రితూ వర్మ.. తాజాగా  డింపుల్‌ హయాతి,  మీనాక్షి! ఇలా ఎంతమంది కథానాయికల వేటలో పడతారు బాబోయ్.. అంటోంది ఇండస్ట్రీ. ఇదంతా మన మాస్ మహారాజ్ రవితేజ చిత్రం గురించే.

రవితేజ కథానాయకుడిగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ఓ  నాయికగా తెలుగమ్మాయి డింపుల్‌ హయాతిని ఎంపిక చేశారు. ‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్ర…’ పాటతో ఆమెకు గుర్తింపు వచ్చింది. అంతకు ముందు రెండు మూడు చిన్న చిత్రాల్లో కథానాయికగా నటించారు. ప్రభుదేవా ‘అభినేత్రి-2’లోనూ సందడి చేశారు. అయితే, రవితేజ చిత్రమే నాయికగా డింపుల్‌ హయాతికి భారీ చిత్రమని చెప్పవచ్చు.

Dimple Hayathi
Dimple Hayathi

మరో నాయికగా మీనాక్షీ చౌదరిని ఎంపిక చేశారు. ప్రస్తుతం సుశాంత్‌కి జంటగా ‘ఇచట వాహనములు నిలుపరాదు’లో ఆమె నటిస్తున్నారు. రవితేజతో ఈ నాయికలు ఇద్దరికీ ఇదే తొలి చిత్రం. అంతకు ముందు నిధీ అగర్వాల్‌, అనూ ఇమ్మాన్యుయేల్,  రితూ వర్మ ‌ పేర్లు పరిశీలనలో వచ్చినప్పటికీ… డింపుల్‌, మీనాక్షిని అవకాశం వరించింది.  ‘రాక్షసుడు’ విజయం తర్వాత రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్‌ 2న ప్రారంభం కానుందని తెలిసింది.

Meenakshi Chowdhari
Meenakshi Chowdhari

మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం చేస్తున్న `క్రాక్` పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. అయితే కథానాయికల ఎంపికలో  మన మాస్ మహారాజ రవితేజ దర్శకుడికి తలనొప్పిని తెప్పించాడట. ఓ సారి నిధీ అగర్వాల్‌.. మరో సారి అనూ ఇమ్మాన్యుయేల్.. ఇంకో సారి రితూ వర్మ.. తాజాగా  డింపుల్‌ హయాతి,  మీనాక్షి…అంటూ తెగ ఇబ్బంది పెట్టాడట.  ఇతడికి ఇదేం పిచ్చిరా బాబోయ్.. అనుకున్నాడట. చివరికి  డింపుల్‌ హయాతి,  మీనాక్షిలు ఓకే అయి దర్శకుడి మాస్ మహారాజ నుంచి కాపాడారట!?