వాహ్.. ఆ గౌరవం దక్కిన ఏకైక నటి రష్మిక !

‘క్రంచీరోల్‌ అనివిూ అవార్డ్స్‌’లో భారత్‌ తరపున పాల్గొనేందుకు స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా జపాన్‌ రాజధాని టోక్యోకి వెళ్లింది . శనివారం టోక్యోలో ఈ అవార్డ్స్‌ వేడుక జరగనుంది. గ్లోబల్‌ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ అవార్డ్స్‌ కార్యక్రమంలో భారతదేశం తరపున రష్మిక రిప్రెజెంట్‌ చేస్తోంది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మికా మందన్నా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

అయితే టోక్యో ఎయిర్‌ పోర్ట్‌లో ఆమెకు జపాన్‌ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజింగ్‌ వెల్కమ్‌ చెప్పారు. రష్మిక ఫొటోస్‌తో డిజైన్‌ చేసిన ప్లకార్డులు చూపిస్తూ ఆమెను ఆహ్వానించారు. ఎయిర్‌ పోర్ట్‌లో అభిమానులు ఇచ్చిన వెల్కమ్‌తో రష్మిక ఆశ్చర్యపోయింది. సర్‌ప్రైజ్‌ అవుతూ వారికి హాయ్‌ చెప్పింది.

‘పుష్ప, డియర్‌ కామ్రేడ్‌’ వంటి సినిమాలతో నేషనల్‌ క్రష్‌గా మాత్రమే కాదు.. గ్లోబల్‌గా రష్మిక అభిమానులను సంపాదించుకుంది. జపాన్‌లోనూ ఆమెకు ఫ్యాన్స్‌ ఉన్నారు. వారు తనపై చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతూ.. రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం రష్మిక మందన్నా ‘పుష్ప 2’, ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది.