రామ్‌ చరణ్ కోసం రష్మిక మండన్న, మృనాల్ ఠాకూర్.?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా పట్టాలెక్కాల్సి వుంది. ‘గేమ్ ఛేంజర్’ పూర్తయితే, ఆ వెంటనే బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాని పట్టాలెక్కిస్తాడు రామ్ చరణ్.

ఈలోగా, హీరోయిన్ అన్వేషణలో బిజీగా వున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సన. బాలీవుడ్ బ్యూటీ రషా తథానీకి కొన్నాళ్ళ క్రితమే లుక్ టెస్ట్ చేశారు. లుక్ టెస్ట్ కోసం ఆమె హైద్రాబాద్ వచ్చి వెళ్ళింది. అయితే, ఇంతవరకు చిత్ర యూనిట్ ఆమె విషయమై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కొత్తమ్మాయ్ కంటే.. పరిచయం వున్న స్టార్ హీరోయిన్ అయితేనే బావుంటుందని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక మండన్న, మృనాల్ ఠాకూర్ పేర్లు తెరపైకొస్తున్నాయ్.

రష్మిక, మృనాల్ ఠాకూర్.. ఈ ఇద్దరిలో మృనాల్ వైపు బుచ్చిబాబు సన మొగ్గు చూపుతున్నాడన్నది ఇంకో వాదన. అయితే, రషా తథానీ దాదాపు కన్ఫామ్ అయ్యిందనీ, మరో పాత్ర కోసమే రష్మిక లేదా మృనాల్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయనీ మరో వాదన కూడా వినిపిస్తోంది.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పూర్తయ్యే నాటికి ఇంకెన్ని మార్పులు జరుగుతాయో ఏమో.!