ఛలో సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది రష్మిక మందాన్న. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ను సొంతం చేసుకుంది. గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది. అయితే కేవలం సినిమాల వల్ల వచ్చిన క్రేజ్ కాదిది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అల్లరి, చిలిపి పనులకు లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు. రష్మిక ఫోటో షూట్లు చూస్తూ ఆమెలోని చిలిపితనం తెలుస్తోంది.
అయితే రష్మిక మందాన్నకు సోషల్ మీడియాలో కాస్త నెగెటివ్ కామెంట్లు కూడా వస్తుంటాయి. వ్యక్తిగత జీవితంలో హీరో రక్షిత్తో ప్రేమ, బ్రేకప్ వంటివి వెంటాడుతూ ఉంటాయి. తాజాగా రష్మిక ఓ పోస్ట్ చేస్తూ తన మనసులోని భావాలను చెప్పుకొచ్చింది. ‘నా మార్గంలో కొన్ని ఎందుకు వస్తాయో నాకు తెలియదు, ఏది జరిగినా సరే నేను చిరునవ్వుతోనే ఉంటాను ..అది మంచిదైనా చెడ్డదైనా సరే.. నవ్వుతూనే ఉంటాను. నిజాయితీగా ఉంటాను. నా పట్ల నేను చాలా గర్వపడుతున్నాను , కృతజ్ఞతతో ఉన్నాను. నేను ఎవరినీ పట్టించుకోను, ఎవరైనా సరే నా మొహంపై ఏనాడైనా బాధను గమనించారా?
ఎందుకంటే అవన్నీ అందరికీ జరుగుతుంటాయని నాకు తెలుసు. వచ్చిన కష్టాలను దూరంగా పారద్రోలి మిమ్మల్ని నవ్వుతూ ఉండేలా చేయాలని అనుకుంటాను. మీరు మీ ఇంట్లో ఉండేలా అనుభూతి చెందేలా నేను ప్రయత్నిస్తాను. మీరు ప్రశాంతంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తాను.. మీరు మీ కాళ్లపై ఎలా నిలబడ్డారో నేను కూడా నా కాళ్లపై అలానే నిలబడాలని కోరుకుంటాను. నేను మీకు ఇష్టమైన నటిగా ఉండాలనే ఉద్దేశ్యం లేదు.. మీ కుటుంబ సభ్యురాలిగా ఉండాలనుకుంటున్నాను. ఇదే నేను చెప్పదలుచుకుంద’ని రష్మిక మందాన్న చెప్పుకొచ్చింది.