శాండిల్ వుడ్ బ్యూటీ రష్మీక మందాన్న తెలుగులో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కన్నడ కిర్రిక్ పార్టీతో ఫేమస్ అయిన రష్మీక మందాన్న ఇక్కడ ఛలో సినిమాతో పాపులర్ అయింది. ఆ వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసింది. ఈ క్రమంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థానికి, ప్రేమకి బ్రేకప్ చెప్పి కెరీర్పై రష్మీక ఫోకస్ పెట్టింది. తాజాగా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మీక మందాన్న.. తాజాగా నెటిజన్లతో ఓ ఆట ఆడింది. వారికి క్విజ్ పోటీలు పెట్టింది. అందులో పలు రకాలు క్వశ్చన్స్, ఆప్షన్స్ ఇచ్చింది. ఇక వాటిలో ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్, తాను అనుకునే ఆన్సర్ను తెలిపింది. అందులో భాగంగా.. గులాబ్ జామ్అనేది నా ఒంటికి, ఆరోగ్యానికి మంచిది కాదు. అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అది నాకు చాలా ఇష్టం అని ఓ ప్రశ్నకు జవాబు ఇచ్చింది.
శ్రీదేవీ, సౌందర్య అంటూ ఇచ్చిన ఆప్షన్స్లో ఇక అందరూ నన్ను శ్రీదేవి బయోపిక్లో చూడాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది అని చెప్పింది.. ఇక నాకు బట్టర్ స్కాచ్ అంటే చాలా ఇష్టం అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ‘నన్ను ప్రతీసారి ఎవరితోనో లింక్ చేసి రాస్తుంటారు.. ఈ ఆన్సర్ వారందరికీ చెబుతున్నా.. నేను సింగిల్.. అలా ఉండటమే నాకు ఇష్టం.. సింగిల్గా ఉండేవారికి, ఉండాలనుకుంటున్న వారికి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. సింగిల్గా ఉండటంలో ఉన్న సరదాను చూస్తే.. మీపై మీకు కలిగే ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది’ అంటూ సింగిల్గా ఉన్నానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది రష్మిక. రష్మీక మందాన్న ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తోంది.