రాం చరణ్ గౌతం తిన్ననూరి కాంబినేషన్ ఫిక్సవడానికి కారణం ఎవరో తెలుసా ..?

రాం చరణ్ తన నెక్స్ట్ సినిమాని గౌతం తిన్ననూరి చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్స్ లో గౌతమ్ తిన్ననూరి ఒకరు. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న నాని తో జెర్సీ అన్న సినిమాని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా నాని కెరీర్లోనే కాక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కెరీర్ లో కూడా ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందనడం లో ఎలాంటి సందేహం లేదు. కాగా జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి తో పలువురు యంగ్ హీరోలు సినిమా చేయాలని భావించారు. కాని గౌతమ్ తిన్ననూరి కి బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం వచ్చింది.

One year of 'Jersey'

టాలీవుడ్ జెర్సీ సినిమానే బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమా బాలీవుడ్ లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ని బట్టి గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేస్తున్నాడట. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చడం తో డేట్స్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిందని ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నట్టు సమాచారం.అయితే రాం చరణ్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పడానికి జెర్సీ సినిమా నే కారణం అని చెప్పుకుంటున్నారు.

Nani's Jersey Director Gowtam Tinnanuri Will Direct Shahid Kapoor in the  Film's Hindi Remake? | 🎥 LatestLY

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న రాం చరణ్ జనవరి లో చిన్న గ్యాప్ తీసుకొని ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి వెళతాడట. ఈ రెండు సినిమాలలో చరణ్ పాత్ర సమ్మర్ లోపు కంప్లీట్ అవుతుందని ఆ తర్వాత రాం చరణ్ – ఎన్వీ ప్రసాద్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో కొత్త సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. కాగా రాం చరణ్ తాజాగా కోవిడ్ బారిన పడ్డాడు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న చరణ్ కి అపోలో ఆసుపత్రి నుంచి స్పెషల్ డాక్టర్స్ ట్రీట్‌మెంట్ చేస్తున్నారు.