‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పూర్తి పనుల్లో లో రామ్‌!

టాలీవుడ్‌ నటుడు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో ఇస్మార్ట్‌ శంకర్‌తో హిట్‌ కొట్టిన రామ్‌కి మళ్లీ సరైన హిట్‌ పడలేదు. ఈ మధ్య బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన ‘స్కంద’ కూడా బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా అనంతరం స్టార్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.

అయితే ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నాడు రామ్‌. ఇప్పటికే హరిశ్‌ హరీష్‌ శంకర్‌తో ఒక సినిమా చేయబోతున్న రామ్‌ మరోవైపు నెట్‌ప్లిక్స్‌తో కలిసి డిజిటల్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఇక ఇవి కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను రామ్‌ లైన్‌లో పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌ దర్శకుడు త్రివిక్రమ్‌తో రామ్‌ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం ‘మిస్టర్‌ బచ్చన్‌’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఈ గ్యాప్‌ను రామ్‌ త్రివిక్రమ్‌తో ప్లాన్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. రామ్‌ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి బ్యానర్‌ లోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.