‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌.. రంగంలోకి దిగిన రామ్‌!

ఇటీవలే స్కంద సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ యాక్టర్‌ రామ్‌ పోతినేని ప్రస్తుతం డబుల్‌ ఇస్మార్ట్‌ తో బిజీ అయిపోయాడు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో హై ఆక్టేన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తోంది.

డబుల్‌ ఇస్మార్ట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు.డబుల్‌ ఇస్మార్ట్‌ ఈజ్‌ బ్యాక్‌.. అంటూ రామ్‌ సెట్స్‌లో సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్‌తోపాటు ఇప్పటికే లొకేషన్‌ నుంచి రిలీజ్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా చాలా రోజుల క్రితమే షూటింగ్‌ మొదలు కాగా.. ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ వచ్చారు.

తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరదించారు. ఫస్ట్‌ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తున్నాడు. పూరీ, మణిశర్మ, చార్మీతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇసార్ట్‌ శంకర్‌ను మించిన ఆల్బమ్‌ రెడీ అవుతుందని చెప్పకనే చెప్పేసింది పూరీ టీం. డబుల్‌ ఇస్మార్ట్‌ 2024 మార్చి 8న సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సందడి చేయనుంది. ఇస్మార్ట్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈ సారి డబుల్‌ ఇంపాక్ట్‌.. అంటూ శక్తిమంతమైన త్రిశూలం.. బ్యాక్‌ డ్రాప్‌లో మంటలు కనిపిస్తున్న లుక్‌తో.. సినిమాలో డబుల్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ అందించబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాడు పూరీ. రామ్‌ మరోవైపు పాపులర్‌ బ్యానర్‌ పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీలో కూడా ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ఈ చిత్రాన్ని సప్త సాగరాలు ధాటి ఫేం రుక్మిణి వసంత్‌తో రొమాన్స్‌ చేయబోతున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.