క్లీంకారతో బిజీగా చెర్రీ దంపతులు!

రామ్‌ చరణ్‌ , ఉపాసన కామినేని దంపతులు ఇప్పుడు క్లీంకారతో బిజీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలామంది దంపతులకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాగే ఇద్దరూ తమ వ్యక్తిగత పనులతో ఎంతో బిజీగా ఉంటూ కూడా పాప క్లీంకార కోసం ఇద్దరూ తమ కాలాన్ని వెచ్చిస్తున్నారు. అలాగే పండగలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్నారు, అందుకే వీళ్ళిద్దరూ బెస్ట్‌ కపుల్‌ అనే కాకుండా, బెస్ట్‌ పేరెంట్స్‌ అని కూడా అందరూ అంటున్నారు.

క్రిస్మస్‌ పండగ సందర్భంగా రామ్‌ చరణ్‌, ఉపాసన ఇద్దరూ తమ పాపతో ఈ పండగని ఆనందంగా జరుపుకున్నారు. ఉపాసన తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో కొన్ని ఫోటోస్‌ షేర్‌ చేశారు. అందులో రామ్‌ చరణ్‌, ఉపాసన పాపతో వున్న ఫోటోస్‌ కాకుండా, అల్లు అర్జున్‌, స్నేహ దంపతులతో వున్న ఫోటోస్‌ కూడా షేర్‌ చేశారు.

అలాగే మెగా కుటుంబానికి సంబదించిన అందరితో క్రిస్మస్‌ పండగ ఎంత బాగా చేసుకున్నారు అన్న విషయం కూడా చెప్పడానికి అందరితో ఒక ఫోటో షేర్‌ చేశారు. స్నేహితురాలు అయిన నమ్రత శిరోద్కర్‌ తో కూడా వున్న ఫోటోని షేర్‌ చేశారు ఉపాసన. కుమార్తెతో వున్న ఫోటో ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది.