మెగా గాసిప్: ’ధృవ’ కాంబో రిపీట్ అవుతోందా.?

‘ధృవ’ సినిమా సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి హీరో రామ్ చరణ్ ఓ హామీ ఇచ్చాడు.. తమ కాంబినేషన్‌లో స్ట్రెయిట్ సినిమా విషయమై. వాస్తవానికి స్ట్రెయిట్ సినిమానే చేయాలనుకున్నా, అనుకోకుండా రీమేక్ సినిమా సెట్టయ్యింది ఈ ఇద్దరి కాంబోలో.. అదే ‘ధృవ’.

కాగా, చరణ్ ఒత్తిడి మేరకు ‘సైరా నరసింహా రెడ్డి’ ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి చేతిలో పడింది. రామ్ చరణ్ నిర్మాత.. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా అది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి టైమ్ ఏమీ బాగాలేదు. అంతా ‘ఏజెంట్’ ఎఫెక్ట్.! ఈ నేపథ్యంలో, సురేందర్ రెడ్డి తన పాత మిత్రుడు రామ్ చరణ్‌ని ఇటీవల సంప్రదించాడని తెలుస్తోంది. కాదు కాదు, చరణ్ స్వయంగా సురేందర్ రెడ్డితో మాట్లాడాడని అంటున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా త్వరలో అనౌన్స్ అయ్యే అవకాశాలున్నాయట. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ మీదనే ఈ సినిమా తెరకెక్కొచ్చు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.