సాయి‌తేజ్ దేవాకట్టా రిపబ్లిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది !

మెగాహీరో సాయి తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. ఈ సినిమాకు దేవా కట్టా దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో రామ్ చరణ్ విడుదల చేశాడు. ఆ పోస్టర్ పై రామ్ చరణ్ కామెంట్ చేస్తూ.. ఈ తాజాగా పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసేలా ఉందని ట్వీట్ చేశాడు. ఇక ఆ పోస్టర్‌..పై 74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందనే భ్రమల్లో మనం బతుకుతున్నాం. ఇంకా ఆ ప్రభుత్వం మనకు ఎలా ఉంటుందో కూడా తెలియదు అని రాసి ఉంది. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాలను చర్చించనున్నారట.

Image

సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తోంది. వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ హీరోగా వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఇక ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో సాయి తేజ్ ను ఒక స్కెచ్ రూపం లో చూపిస్తూ పోస్టర్‌ను ఆసక్తికరంగా రూపోందించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ ‘రిపబ్లిక్’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. ఇక చాలా రోజుల తర్వాత దేవా క‌ట్టా నుంచి వస్తున్న పక్కా పొలిటికల్ సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడు రిపబ్లిక్‌తో వస్తున్నాడు. చూడాలి ఈ సినిమా ఎలా ఆకట్టుకోనుందో.. సాయి తేజ్ ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా ఓకే చేశాడు. సాయి తేజ్ ఈ సినిమాతో మరో సినిమాను చేస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉందట చిత్రబృందం. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నితిన్ రంగ్ దే సినిమాను చేస్తుంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది.