రామ్‌చరణ్‌ ‘ఆర్‌సి-16’ మొదలయింది…

‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన క్రమంలో.. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌, సుకుమార్‌, చిరంజీవి, అల్లు అరవింద్‌, బోనీకపూర్‌తోపాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడారు. అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌ అవుతారన్నారు.

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా… గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. జాన్వీకపూర్‌ కథానాయిక. రెహమాన్‌ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఆర్‌సి16గా ఇది ప్రచారంలో ఉంది.

‘పెద్ది’ టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ మొదలు కానుంది. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ పనుల్లో బిజీగా ఉండగా, ‘దేవర’ కోసం జాన్వీ వర్క్‌ చేస్తున్నారు. ఈ ఓపెనింగ్‌ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌, నిర్మాత బోనీ కపూర్‌, దర్శకుడు సుకుమార్‌, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌.. అలాగే ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో సినిమా చేస్తోన్న డైరెక్టర్‌ శంకర్‌ వంటి ప్రముఖులెందరో హాజరయ్యారు.

వీరంతా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ విూడియాలో సెన్సేషన్‌గా మారాయి. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను మెగా ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తూ.. టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.