లోకేశ్‌ కనగరాజ్‌తో తలైవా సినిమా

పుష్కర కాలం తర్వాత జైలర్‌తో మాస్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు సూపర్‌ స్టార్‌ రజనీ. హిట్టంటే మళ్లీ ఆషామాషీ హిట్టు కాదు. విక్రమ్‌, పొన్నియన్‌ సెల్వన్‌ వంటి ఇండస్టీ హిట్‌ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్‌ మార్కెట్‌ ఉన్న తెలుగులోనూ మాస్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు. నిజానికి రజనీ సినిమాలు గతకొంత కాలంగా తెలుగులో కనీసం పబ్లిసిటీ ఖర్చులు ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేక పోతున్నాయి.

కానీ జైలర్‌ మాత్రం ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది. ఏడు పదుల వయసులోనూ రూ.600 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి సూపర్‌ స్టార్‌ రేంజ్‌ అంటే ఇది అని విమర్శకులకు సమాధానం చెప్పాడు. ప్రస్తుతం రజనీ జై భీమ్‌ దర్శకుడు జ్ఞానావేల్‌ రాజాతో తన 170వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే నెలలో షూటింగ్‌ ప్రారంభించనుంది. ఇక ఈ సినిమా తర్వాత రజనీ.. లోకేష్‌ కనగరాజ్‌తో సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే వీటికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ కూడా అయిపోయాయి. అంతే కాకుండా ఈ సినిమాలోని కాస్ట్‌ గురించి కూడా పలు లీకులు బయటపడ్డాయి. కాగా తాజాగా ఈ కాంబినేషన్‌పై అఫీషియల్‌ ప్రకటన వచ్చింది. రజనీ తన తదుపరి సినిమాను లోకేష్‌తో చేయబోతున్నట్లు సన్‌ పిక్చర్స్‌ సంస్థ ప్రకటించింది.

జైలర్‌ వంటి ఇండస్టీహ్రిట్‌ తర్వాత కళానిధి మారన్‌ వెంటనే రజనీతో మరో సినిమా చేయడం విశేషం. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు. ప్రముఖ స్టంట్‌మాస్టర్స్‌ అన్బరివ్‌లు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లుగా పనిచేయనున్నారు.

ఇక ప్రస్తుతం లోకేష్‌ లియో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. దసరా టాª`గ్గంªట్‌గా రిలీజవుతున్న ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి హైప్‌ ఉంది. ఇక ఈ సినిమా రిలీజవ్వగానే లోకేష్‌ రజనీ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ చేయనున్నాడు. అన్నీ అనుకున్నట్ల జరిగితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్‌ ఉంది.