వరుస ప్రాజెక్టులతో రజనీ బిజీ.. బిజీ!

యంగ్‌ హీరోలను స్పీడున్నోళ్లు అంటుంటాం. కానీ సీనియర్ల స్పీడు చూస్తుంటే, వి వాంట్‌ టు ఫాలో ఫాలో యూ అనాలనిపించేలా ఉంది. నేము, ఫేము వాళ్లకి ఊరికే రాదనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రజనీ ఫిల్మోగ్రఫీలో లైనప్‌ చూస్తుంటే… సూపర్‌ తలైవా అనాలనిపిస్తోంది ఫ్యాన్స్‌ కి. ఏడు పదులు దాటిన ఏజ్‌లో రాఫ్ఫాడించేస్తున్నారు రజనీకాంత్‌. వయసుకు తగ్గ కేరక్టర్లు సెలక్ట్‌ గా చేసుకుంటూ, ఫ్యాన్స్‌ కి ఏం కావాలో గుర్తుపెట్టుకుని శాటిస్‌ఫై చేస్తూ వారెవా అనిపించుకుంటున్నారు.

ఈమధ్య జైలర్‌లో రజనీకాంత్‌ని చూసిన వారు, తలైవర్‌ ఈజ్‌ బ్యాక్‌ అని అన్నారు. నెల్సన్‌తో మళ్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. జైలర్‌ సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటూనే లాల్‌సలామ్‌ కంప్లీట్‌ చేశారు రజనీ. కూతురి కోసం చేసిన ఈ కు నెగటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయింది. అయినా పట్టించుకోకుండా వాట్‌ నెక్స్ట్‌ అంటూ మూవ్‌ అవుతున్నారు తలైవర్‌.

లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో చేయనున్నారు రజనీకాంత్‌. విక్రమ్‌, లియో నచ్చి లోకేష్‌కి కాల్షీట్‌ ఇచ్చారు సూపర్‌స్టార్‌. రజనీ ఫ్యాన్‌గా తాను ఈ చేస్తానని అనౌన్స్‌ చేశారు లోకేష్‌. ప్రస్తుతం జ్ఞానవేల్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు తలైవర్‌. త్వరలోనే ఈ షూటింగ్‌ పూర్తవుతుంది. అటు కార్తిక్‌ సుబ్బరాజ్‌ కూడా తలైవర్‌ కోసం కథలు రెడీ చేస్తున్నారు. పేట్ట కాంబో ఈజ్‌ బ్యాక్‌ అంటూ అతి త్వరలోనే ను అనౌన్స్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటోంది కోలీవుడ్‌. అయితే ఈ కథ పేట్టకు సీక్వెల్‌ అవుతుందా? లేకుంటే ఫ్రెష్‌ స్టోరీతో సాగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.