Rajamouli:మహేష్ తో సినిమా గురించి కొత్త అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..!

Rajamouli: ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ కాంబినేషన్ వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఎంత విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ యొక్క తడాఖా తెలియజేసింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క సెలబ్రిటీలు కూడా రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి ఎన్టీఆర్ చరణ్ నటన గురించి కొనియాడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి తర్వాతి సినిమా మహేష్ బాబు తో తీస్తున్నారు అని తెలియటంతో అందరి చూపు ఆ సినిమాపై పడింది.

ఈ మధ్యనే రాజమౌళి మహేష్ బాబు నటించిన సినిమా మల్టీస్టారర్ కాదని కూడా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఎప్పుడు ఉంటుందన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే జక్కన్న ఈ మెగా ప్రాజెక్ట్ బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించి ఉంటుందని వెల్లడించి సినిమాపై హైప్‌ని ఆకాశాన్ని తాకేలా చేశారు. ఇక రాజమౌళి మహేష్ బాబు తీసిన ఈ సినిమాకు బడ్జెట్ కూడా ఎనిమిది వందల కోట్లు ఉంటుందని కూడా వార్తలు వినిపించాయి.

ఇక తాజాగా జక్కన్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌ను వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి చాలా ప్రీ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి మరో ఆరు నెలల్లో సినిమాను ప్రారంభించనున్నట్టు రాజమౌళి వెల్లడించారు.ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మహేష్ , రాజమౌళి మూవీ 2023లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో #SSMB28ని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక SSMB29 స్టార్ట్ అవుతుంది.