ఎస్ఎస్ఎంబీ29 సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ బాహుబలి, ఆర్ఆర్ఆర్ స్థాయికి తగ్గట్టుగా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కానీ సినిమాపై బజ్ మాత్రం అంతకంటే ఎక్కువే ఉంది. ఇక ఎప్పుడు స్టార్ట్ చేశారో కరెక్ట్ గా ఇప్పటివరకు ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్లో రాజమౌళి ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేశారని, మూడో షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇది ఆయన కెరీర్లోనే ఫాస్టెస్ట్ మూవ్ అన్నట్టుగా ఉంది.
ప్రస్తుతం ఇండియాలో స్పెషల్ ఫారెస్ట్ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. అంతకుముందు విదేశాల్లో యాక్షన్ అడ్వెంచర్ ఎపిసోడ్స్ను పూర్తి చేశారట. ఫారిన్ లొకేషన్లలో పలు పార్ట్స్ షూట్ చేసిన జక్కన్న, ఈసారి టైమ్ వేస్ట్ కాకుండా స్టెప్పులేస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈసారి బడ్జెట్ కు తగ్గట్లే విజువల్స్పై రాజమౌళి నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీలో మహేష్ బాబు గ్లోబల్ యాత్రికుడిగా కనిపించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథలోని ముఖ్య అంశాలపై హింట్ ఇచ్చారు. కాగా, ప్రియాంక చోప్రా పేరు కూడా ఈ సినిమా కాస్టింగ్లో వినిపించడం మరో హైలెట్. ఏదేమైనా జక్కన్న ఫాస్ట్ షెడ్యూళ్లతో షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు అంటే, నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. ఇక మామూలుగా ఓ సినిమా కోసం రాజమౌళికి రెండేళ్లు పడుతుంటే, ఈసారి మాత్రం ఒకటిన్నరలోనే సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట. అయితే ఇది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. మరి ఫస్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.