విదేశాల్లో రాజమౌళితో మహేష్ సిట్టింగ్.!

‘గుంటూరు కారం’ సినిమాతో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నారు మహేష్ బాబు.

అయితే, ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ రాజమౌళితో సిట్టింగ్స్ వేస్తున్నారట మహేష్ బాబు. ఇటీవల షూటింగ్ బ్రేక్స్‌లో భాగంగా మహేష్ బాబు విదేశాలకు వెళుతున్న సంగతి తెలిసిందే.

విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్‌మెంట్‌తో పాటూ, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించి చర్చోపచర్చలు జరుపుతున్నారనీ ఇన్‌సైడ్ టాక్.

హాలీవుడ్ ఏజెన్సీలు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం కొలాపరేట్ అవుతున్నాయట. ‘గుంటూరు కారం’ సినిమా పూర్తయ్యాకా పూర్తిగా ఈ సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నారట మహేష్ బాబు.

ఆ లోపు సినిమాపై పూర్తి క్లారిటీకి వచ్చేయనున్నారట. గ్లోబ్ ట్రోటింగ్ నేపథ్యంలో అత్యంత సాహసోపేతంగా ఈ సినిమాని చెక్కేందుకు సిద్ధమవుతున్నాడట జక్కన్న.

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ పూర్తి చేసే లోపు ఈ సినిమాకి అవసరమైనవన్నీ సమకూర్చే పనిలో బిజీగా వున్నారట ఆయన.

మహేష్ వీలును బట్టి విదేశాల్లోనే 15 నుంచి 20 రోజుల పాటూ సిట్టింగ్స్‌లో పాల్గొనబోతున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ సిట్టింగ్స్‌లో భాగంగా సినిమాకి సంబంధించి, ఇంకేదైనా కొత్త లీకులివ్వనున్నారేమో జక్కన్న.!