జక్కన్న, మహేష్ మూవీ… అప్పుడే షూట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. దీనిని కంప్లీట్ చేసిన తర్వాత రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. జులై ఆఖరుకి స్క్రిప్ట్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. తరువాత స్టొరీబోర్డ్ వర్క్ ని రాజమౌళి స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రం గురించి ఇప్పుడు ఓ ఇంటరెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది.

రాజమౌళి తన సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ముందు టెస్ట్ షూట్ కూడా చేస్తారు. అలాగే వర్క్ షాప్ నిర్వహిస్తారు. టెస్ట్ షూట్ కోసం జక్కన్న భారీగానే ఖర్చు చేస్తారు. స్క్రిప్ట్ వర్క్ ఆఖరుకి వచ్చేయడంతో టెస్ట్ షూట్ కోసం రాజమౌళి రెడీ అవుతున్నారంట. డిసెంబర్ లో ఈ షూట్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట.

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ కూడా డిసెంబర్ లో ప్రత్యేకంగా జక్కన్న మూవీ కోసం డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇది కంప్లీట్ అయ్యాక వచ్చే ఏడాది వేసవి నుంచి పూర్తిస్థాయిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ నటులని కూడా ఎంపిక చేయనున్నారు. మహేష్ బాబుకి విలన్ గా హాలీవుడ్ యాక్టర్ ని రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం.

వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించనున్నట్లు ఇప్పటికే జక్కన్న క్లారిటీ ఇచ్చారు. అలాగే కథ పూర్తిగా ఆఫ్రికాలోనే అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని చెప్పారు. మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకునేని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని టాక్.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న గుంటూరు కారం మూవీని మహేష్ బాబు ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. నవంబర్ ఆఖరుకి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. తరువాత కంప్లీట్ గా రాజమౌళి సినిమాపై మహేష్ బాబు ఫోకస్ పెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.