Radhika sharth kumar : చిరంజీవిని అన్నిసార్లు కొట్టా…ఆ సినిమాలో సన్నివేశం కోసం తప్పలేదు…!

Radhika sharth kumar : ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన అలనాటి హీరోయిన్ రాధికా శరత్ కుమార్ వచ్చి నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఆలీతో కలిసి సూపర్‌హిట్‌ గీతం ‘సందె పొద్దులకాడ ’ పాటకు కాలు కదిపి అలరించారు. చంద్రమోహన్‌తో కలిసి నటించిన ‘మూడు ముళ్లు’ షూటింగ్‌, దర్శకుడు కోదండ రామిరెడ్డి, తన హెయిర్‌ డ్రెస్సర్‌ రీటా సంగతులు పంచుకున్నారు. బెంగాలీ చైనీస్ అయిన తన హెయిర్ డ్రెస్సెర్ గురించి ఆలీ అడగడంతో నవ్వుకున్నారు.దర్శకుడు భారతీరాజాతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

ఇక రాధికా, చిరు కాంబినేషన్ అనగానే హిట్ పెయిర్ అని టక్కున చెబుతాం. అలనాటి సినిమాల్లో వీళ్లిద్దరి జోడి హిట్ కాంబినేషన్. చిరంజీవి విలన్ గా నటించిన న్యాయం కావాలి సినిమా రాధికా కెరీర్ ను మలుపు తిప్పింది. ఇక తల్లి పాత్రలలో అలరిస్తున్న రాధిక చిరుతో మాత్రం తల్లి పాత్ర చేయనని చెప్పేసింది. కావాలంటే విలన్ గా నటిస్తానని చెప్పారు. ఇక తనకు ఎలాంటి భేద భావాలు లేవని అన్ని మతాల పండుగలను జరుపుతానని చెప్పారు.

ఇక ఈ షోలో ఒక ఆసక్తికర సంఘటన వివరించారు.న్యాయం కావాలి సినిమాలో చిరంజీవిని కొడుతూ మాట్లాడే సన్నివేశంను 23సార్లు టేకులు తీసుకోవడంతో చిరంజీవిని 23 సార్లు గట్టిగా కొట్టానని చెప్పారు ఇక షూటింగ్ తర్వాత చూస్తే ముఖం ఎర్రగా అయిందని చెప్పారు. న్యాయంకావాలి సినిమా తనకు సినిమా కెరీర్ లో ట్యూనింగ్ పాయింటని చెప్పారు. ఇక బుల్లి తెర పై ఈటీవీలో నటించిన ఇది కథ కాదు కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని తెలిపారు.