మరో పల్లెటూరి ప్రేమకథ..రాధామాధవం !

టాలీవుడ్‌లో ప్లలెటూరు కథలు ఎప్పుడూ హిట్‌ ఫార్ములాయే. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన మెజారిటీ ప్రేమ కథలు విజయాలు సాధించాయి. ఆ జానర్‌ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మరో ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది.

యువనటులు వినాయక్‌ దేశాయ్‌, అపర్ణా దేశాయ్‌ జంటగా రూపుదిద్దుకొంటున్న ప్రేమకథా చిత్రం ‘రాధామాధవం’ . ఈ సినిమాకు దాసరి ఇస్సా దర్శకత్వం వహిస్తుండగా.. గోనాల్‌ వెంకటేశ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకోగా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్‌ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయింది.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ట్రైలర్‌ బాగుందని మంచి ప్లలెటూరి ప్రేమకథ చూడబోతున్నామని ఫీలింగ్‌ కలిగించిందని వెల్లడించారు. ఇక ఈ మూవీ మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నట్లు శ్రీకాంత్‌ చెప్పారు. ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర యునిట్‌ తెలిపింది.