‘రాచరికం’లో భయపెట్టేలా సీన్స్‌… !

విజయ్‌ శంకర్‌, అప్సరా రాణి హీరోహీరోయిన్లుగా చిల్‌ బ్రోస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దు కుంటోన్న సినిమా ‘రాచరికం’. ఈశ్వర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేష్‌ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్‌ వదిలారు. హీరోయిన్‌ అప్సరా రాణి పుట్టిన రోజు జనవరి 12 సందర్భంగా ఈ సినిమా నుండి ఆమెకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే.. ఇప్పటి వరకు గ్లామర్‌కే పరిమితమైన అప్పరా రాణికి ఇందులో అద్భుతమైన పాత్ర లభించినట్టుగా కనిపిస్తోంది. కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, రక్తంతో ఒళ్లంతా తడిసి ముª`దదైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా ఉన్నారు.

ఈ పోస్టర్‌తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ వస్తాయని చిత్రయూనిట్‌ అంటోంది. విజయ రామరాజు, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, మహబూబ్‌ బాష, రూపేష్‌ మర్రాపు, ప్రాచీ థాకర్‌, లత, ఈశ్వర్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకు వెంగి సంగీతాన్ని అందిస్తుండగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

ప్రస్తుతం అప్సరా రాణికి సంబంధించిన ఈ పోస్టర్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తుండటం విశేషం.