నా చుట్టూ 25 మంది.. అప్పుడు భయమేసింది : రాశీ ఖన్నా

Raashi Khanna ABout Shooting with Covid 19 Precautions

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లతో అంతా హడావిడిగా మారింది. పెద్ద పెద్ద హీరోలందరూ సెట్స్ పైకి వచ్చారు. లాక్డౌన్ వల్ల వాయిదా పడ్డ షెడ్యూల్‌లను మళ్లీ ప్రారంభించారు. ఒకప్పటి వాతావరణమే మళ్లీ ఏర్పడింది. కాకపోతే అందులో చాలా మార్పులు వచ్చాయి. వీలైనంత తక్కువ మందితో షూటింగ్ చేయడం, నిత్యం శానిటైజ్ చేయడం, మాస్కులు, ఫేస్ షీల్డ్‌లు ధరించడం ఇలా ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లు చేస్తున్నారు.

Raashi Khanna ABout Shooting with Covid 19 Precautions
Raashi Khanna ABout Shooting with Covid 19 Precautions

అదే విషయాన్ని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. దాదాపు ఐదారు నెలలు ఇంటి పట్టునే ఉంటూ అమ్మ నాన్నలను చూస్తుండిపోయానని రాశీ ఖన్నా చెప్పింది. అయితే షూటింగ్‌ల కోసం ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి అంతా కొత్తగా అనిపించిందని పేర్కొంది. లాక్ డౌన్ మొత్తం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఎంజాయ్ చేసింది.

కొవిడ్‌-19 నియమాలను అనుసరిస్తూ షూటింగ్‌లో పాల్గొనడం కొత్తగా ఉందని తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో అమ్మానాన్నను తప్పా వేరేవాళ్లని కలవలేదని పేర్కొంది. దీంతో షూటింగ్‌ కోసం చెన్నైకి వచ్చాక సెట్‌లో నా చుట్టూ 25 మందిని చూసి మొదట కొంచెం కంగారుగా అనిపించింది. కానీ, కెమెరా ముందుకు వెళ్లే సరికి నా భయాలన్నీ పోయాయి. వర్క్‌ చేయాలనే ఆసక్తి పెరిగిపోయిందని తెలిపింది.