రత్తాలుతో చిరంజీవి రచ్చ.. రాయ్ లక్ష్మీ పోస్ట్ వైరల్

Raai laxmi selfie with Megastar Chiranjeevi

రత్తాలు రత్తాలు అంటూ ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాసు నీ గ్రేసూ అంటూ రత్తాలు పాత్రలో రాయ్ లక్ష్మీ వేసిన స్టెప్పులు బాగానే వైరల్ అయ్యాయి. అలా ఖైదీ నెంబర్ 150లో రాయ్ లక్ష్మీ కనిపించింది ఒకే ఒక్క పాటలో కానీ.. ఫుల్ క్రేజ్ వచ్చేసింది. చిరు స్టైల్, గ్రేస్‌కు తగ్గట్టు రాయ లక్ష్మీ వేసిన స్టెప్పులు బాగానే క్లిక్ అయ్యాయి. అయితే మళ్లీ దాదాపు మూడు నాలుగేళ్ల తరువాత మళ్లీ చిరంజీవి రత్తాలను కలిశాడు. అది ఎక్కడో అందరికీ తెలిసిందే.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో రాయ్ లక్ష్మీ అదిరిపోయే స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేసింది. అంతే కాకుండా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి అరియానాను బయటకు తీసుకొచ్చింది. అలా బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్‌లో తన వంతు బాధ్యతను పూర్తి చేసింది. అలా ఉన్న రాయ్ లక్ష్మీ.. ఫినాలె ఎపిసోడ్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన చిరంజీవితో రచ్చ చేసింది. చిరంజీవితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ అదిరిపోయే కామెంట్స్ చేసింది. ఆ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్అవుతోంది.

Raai laxmi selfie with Megastar Chiranjeevi
Raai laxmi selfie with Megastar Chiranjeevi

చిరుతో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. మళ్లీ మేం కలిశాం… మిమ్మల్ని కలవడం, చూడటం ఎల్లప్పుడూ ఆశ్చర్యంగానూ, పాజిటివ్‌గాను ఉంటుంది.. ఎల్లప్పుడూ మీరెంతో కేరింగ్, లవింగ్.. అద్భుతమైన వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి గారు.. రత్తాలు మళ్లీ కలిసింది.. ఎప్పుడూ మీరే ఎవర్ గ్రీన్ స్టార్.. మీపట్ల ఎప్పుడూ గౌరవం, కృతజ్ఞత ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ సెల్ఫీలో మాత్రం ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా ఉన్నారు.