సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన అల్లు అర్జున్‌ ‘పుష్ప’ వీడియో

‘అర్జునుడై గురిపెట్టెను..అల్లు తన విల్లు…శతాబ్దాల తెలుగువాళ్ల బాకీ ఇక చెల్లు‘ అని చెబుతూ ఓ వీడియో సోషల్‌ విూడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రం కోసం ఎంతగా కష్టపడ్డారో తెలిసిందే!. ’పుష్పరాజ్‌’ పాత్ర కోసం తన యాస, భాష మొత్త మార్చుకున్నారు.

తెరపై ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే ఆయన డీగ్లామర్‌ పాత్రలో రగ్గ్‌డ్‌గా కనిపించారు. మొరటు మనిషిలా తయారు. తనదైన మేనరిజంతో ప్రేక్షకుల్ని అలరించారు. వీటన్నింటి ఫలితంగానే జాతీయ పురస్కారం దక్కిందని చిత్ర బృందం సంబరాలు చేసుకుంటోంది. సుకుమార్‌ ఈ ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ’పుష్ప `2’ తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయుకా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.