టిల్లుగాని గాళ్ ఫ్రెండ్‌ని అలా ఒప్పించారట.!

‘డీజె టిల్లు’ సినిమాలో రాధిక పాత్రతో తెగ పాపులర్ అయిపోయింది నేహాశెట్టి. అంతకు ముందే ‘మెహబూబా’ సినిమాలో నటించినప్పటికీ నేహాశెట్టికి ‘టిల్లుగాని గాళ్ ఫ్రెండ్’గానే ఎక్కువ పాపులారిటీ దక్కిందని చెప్పాలి.

ఇదే పాపులారిటీని ‘డీజె టిల్లు’ సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’‌లో కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట. మొదట్లో నేహా శెట్టి పాత్రకు ఈ సినిమాలో ఛాన్స్ లేదు.

అనుపమ పరమేశ్వరన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే, మొదటి పార్ట్‌లో రాధిక పాత్రకు వచ్చిన క్రేజ్‌తోనే ఆమె పాత్రను గెస్ట్ రోల్‌లా ఈ సినిమాలో యాడ్ చేశారట.

అయితే, ఈ సినిమాలో నటించేందుకు నేహా శెట్టి తొలుత నిరాకరించిందట. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులున్నాయ్. సో, డేట్స్ అడ్జస్ట్ చేయలేకనే నో అనేసిందట.

అయితే, నిర్మాత గుస్సా అయ్యాడట. మొత్తానికి బలవంతంగానే ఒప్పుకోక తప్పలేదట. అన్య మనస్కంగానే షూటింగ్‌లో పాల్గొందట నేహా శెట్టి.

అయితే, నేహాశెట్టిని డైరెక్టర్ చాలా బాగా చూసుకున్నాడట. దాదాపు హీరోయిన్‌కి ఇచ్చినంత రెమ్యునరేషన్ ముట్ట చెప్పాడట. దాంతో, నేహా శెట్టి పిచ్చ హ్యాపీగా వుందట.

అదే నిర్మాతతో ఇంకో సినిమా కూడా ఓకే చేసిందనీ సమాచారం. నేహాశెట్టి విషయంలో ఇటు నిర్మాతే కాదు, హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడట.