SSMB 28: ఆమె కారణంగా మరో వర్క్ పెండింగ్

త్రివిక్రమ్ ని టెన్షన్ పెడుతున్న పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న పూజా హెగ్డే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొని ఉంది. అతడు, ఖలేజా వీరిద్దరి కాంబోలో ఇది వరకు వచ్చాయి. అయితే ఆ రెండు సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి తరువాత టెలివిజన్ పై ప్రేక్షకులకి చేరువ అయ్యాయి.

ఆ రెండు సినిమాలలో మహేష్ బాబుని త్రివిక్రమ్ కొత్తగా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ కి వెంటనే అవి రీచ్ కాలేదు. అయితే మహేష్ బాబు బెస్ట్ మూవీస్ లలో అతడు, ఖలేజా సినిమాలు కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. ఇదిలా ఉంటే అటు మాటల మాంత్రికుడు అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలలో వరుస హిట్స్ అందుకొని జోరు మీద ఉన్నాడు. ఇటు మహేష్ బాబు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.

ఈ నేపధ్యంలో ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ కొత్త సినిమాపై హైప్ ఉంది. ఇదిలా ఉంటే జనవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఏప్రిల్ నెల ఆఖరుకి మిగిలిన పార్ట్ అంతా పూర్తవుతుందని సమాచారం. ఫస్ట్ హాల్ఫ్ లో మెజారిటీ సన్నివేశాలు త్రివిక్రమ్ కంప్లీట్ చేసారని సమాచారం.

పూజా హెగ్డే కాంబినేషన్ సన్నివేశాలు కొన్ని పెండింగ్ లో ఉండిపోయాయి. ఆమె కాలికి తగిలిన గాయం కారణంగా ఈ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనలేదని సమాచారం. ఈ నేపధ్యంలో ఆమెకి సంబందించిన సన్నివేశాలు తప్ప మిగిలినవి పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ లో పూజా హెగ్డే పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.