‘మంగళవారం’లో మత్తెక్కించనున్న పాయల్‌ రాజ్‌పుత్

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో పాపులరైన హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు.. అందులో హీరోయిన్‌గా ఒక డేరింగ్‌ రోల్‌ చేసిన పాయల్‌ రాజ్‌ పుత్‌ కూడా సెన్సేషన్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పాయల్‌ కు చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో నటిస్తోంది పాయల్‌. పాయల్‌ లీడ్‌ రోల్‌ లో దర్శకుడు అజయ్‌ భూపతి రూపొందించిన చిత్రం ‘మంగళవారం’.

నందితా శ్వేత, అజయ్‌ ఘోష్‌, దివ్యా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలో పాయల్‌ చేసిన పాత్ర పై ఓ ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. ఇందులో పాయల్‌ నింఫోమానియాక్‌ కండీషన్‌ వున్న పాత్రలో కనిపిస్తుందని సమాచారం. నింఫోమానియాక్‌ అంటే.. శృంగార కోరికలను అదుపు చేయలేని స్థితి.

ఈ పాత్ర చాలా బోల్డ్‌ గా వుంటుందని, కథలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ లో కొన్ని బోల్డ్‌ సీన్లు వున్న సంగతి తెలిసిందే. ”ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత పాయల్‌` అజయ్‌ భూపతి కాంబోలో తెరకెక్కిన చిత్రం కావడంతో ‘మంగళవారం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.