“వీరసింహా రెడ్డి” కి పాన్ ఇండియా లెవెల్ ట్రోల్స్.?

Veera-Simha-Reddy-Box-Office1673581264174

ఈ ఏడాదిలో సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన లేటెస్ట్ సినిమాల్లో మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ తెరకెక్కించిన చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి తెలుగు ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. కానీ మొదటి రోజుతో పోలిస్తే మిగతా రోజుల్లో రన్ మాత్రం షాకింగ్ గా అయితే మారిపోయింది.

దీనితో ఓవరాల్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ గానే నిలిచిపోయింది. అయితే క్రేజ్ మాత్రం ఓపెనింగ్స్ లో గట్టిగా చూపించిన ఈ చిత్రం మొన్ననే ఓటిటి లో కూడా విడుదల అయ్యి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ సినిమా హాట్ స్టార్ లో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యింది.

మరి సినిమా చూసిన ఆడియెన్స్ మెయిన్ గా హిందీ మరియు తమిళ్ ఆడియెన్స్ అయితే వీరసింహా రెడ్డి పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ రేంజ్ ఓవర్ ఏక్షన్ సీన్స్ ఏంటని ఏకేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సినిమా ఇంతకుముందు చూడని వారు తమకి నచ్చిందని చెప్తున్నారు.

అలాగే మరికొందరు మొదటి హాఫ్ పక్కన పెడితే నెక్స్ట్ హాఫ్ బానే ఉందని అంటున్నారు. మొత్తానికి మాత్రం ఈ సినిమాకి మరోసారి భారీ ఎత్తున నెగిటివిటీ వస్తుందని చెప్పాలి. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాని తెరకెక్కించాడు.