సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్‌!

దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. గురునానక్‌ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని విశ్వనటుడు కమల్‌హాసన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’’సినిమాతో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా చిత్రీకరణ కోసం కమల్‌హాసన్‌ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగా కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇండియన్‌’2’ తోపాటు ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఎడీ’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా, మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్స్‌లైఫ్‌’ చిత్రాలు చేస్తున్నారు.